విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వీఐపీ బ్రేక్‌ దర్శనం

-

తిరుమల మాదిరి విజయవాడ కనకదుర్గమ్మగుడిలోని వీఐపీ బ్రేక్ దర్శనం అమల్లోకి రానున్నట్లు సమాచారం. దసరా ఉత్సవాల్లో విజయవాడ దుర్గగుడిలో తిరుమల తరహా వీఐపీ బ్రేక్‌ దర్శనానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దుర్గమ్మను సోమవారం రోజున మంత్రి సత్యనారాయణ దర్శించుకున్నారు. బ్రేక్‌ దర్శన ఏర్పాట్లపై ఈవో భ్రమరాంబతో చర్చించారు.

సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఘాట్‌ రోడ్డులో అదనపు లైన్లు ఏర్పాటుచేయాలని సూచించారు. వీఐపీలకు అనువుగా నిర్ణీత సమయం కేటాయించినప్పుడు వారూ సహకరిస్తారన్నారు. సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం ఉండదని, వీఐపీల వాహనాలను నియంత్రించేందుకు సాధ్యమవుతుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news