‘విరూపాక్ష‌’గా వచ్చేసిన సాయిధ‌రమ్..ఎన్టీఆర్‌ వాయిస్‌తో అదిరిపోయిన అనౌన్స్ మెంట్

-

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే తన కెరీర్ లో 15వ సినిమా మంచి ప్రతిష్టాత్మకంగా మారగా, ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.


ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుండగా మేకర్స్ అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు రివిల్ చేశారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్‌ ను కూడా అనౌన్స్‌ చేశారు. ఈ టైటిల్‌ గ్లింప్స్‌ ను ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ తో రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

ఇక అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమాకు ‘విరూపాక్ష‌’ అనే డిఫరెంట్‌ టైటిల్‌ ను పెట్టారు. అజ్ఞానం భయానికి మూలం, భయం మూడనమ్మకానికి కారణం, ఆహ్ నమ్మకమే నిజాం అయినప్పుడు ఆహ్ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం అంటూ చెప్పే ఎన్టీఆర్‌ డైలాగ్స్‌ ఈ టీజర్‌ కు హైలేజ్ గా నిలిచింది. అలాగే, ఈ సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిలో 21న రిలీజ్‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news