దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు ఏపీలో అమలు చేస్తున్నాం – సజ్జల

-

రేపటినుండి ” జగనన్నే మా భవిష్యత్” కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, తాము చేపట్టిన వాటి గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తామని అన్నారు. 1.80 లక్షల ఇళ్లను గృహ సారథులు సందర్శిస్తారని తెలిపారు.

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రజల్లోంచి వచ్చిందేనన్నారు. 7 లక్షల మంది గృహ సారధులు ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తారని తెలిపారు. ఇలాంటి సాహసం గతంలో ఎవరు చేయలేదన్నారు సజ్జల. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు ఏపీలో అమలు చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news