మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించాం : సీఎం జగన్

-

మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించామని  సీఎం జగన్ తెలిపారు. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన మీడియాతో  మాట్లాడారు. 58 నెలల కాలంలోనే 2లక్షల 70వేల కోట్ల రూపాయలు డీబీటీ గా.. అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లడం ఒక హిస్టరీ అని చెప్పారు.

మనం మేనిఫెస్టోను అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. 2019కి ముందు మేనిఫెస్టోను విడుదల చేశారు. కానీ ఇలా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన ఘనత మనకే దక్కుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ అధికారి దగ్గర మన మేనిఫెస్టో ఉంది. దాదాపు 99 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కేవలం ఎన్నికలప్పుడు మాయమాటలతో, మోసపూరిత హామీలతో మేనిఫెస్టో విడుదల చేస్తారు. వాటిని మాత్రం అమలు చేయలేరు. చేయగలిగేవి మాత్రమే చెప్పి.. చేసి చూపించి ప్రజల వద్దకు ఓ హీరోగా వెళ్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి అని సూచించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news