21 రోజుల షూటింగ్ ఫుటేజీ పోగొట్టుకున్నాం: రజనీకాంత్ కూతురు ఐశ్వర్య

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం లాల్ సలాం. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ కి సంబంధించి 21 రోజుల ఫుటేజ్ కోల్పోయామని డైరెక్టర్ ఐశ్వర్యా రజనీకాంత్ తాజాగా వెల్లడించారు. ‘క్రికెట్ కి సంబంధించిన సన్నివేశాలు 20 కెమెరాలతో రియల్ మ్యాచ్ వలె షూట్ చేశాం అని అన్నారు.

దురదృష్టవశాత్తూ అది పోగొట్టుకున్నాం అని తెలిపారు. ఈ ప్రభావం మూవీపై గట్టిగా పడింది’ అని ఆమె చెప్పారు. రజనీకాంత్ స్టార్డమ్ దృష్టిలో పెట్టుకుని స్టోరీలో చేసిన మార్పులు కూడా మూవీ పరాజయానికి కారణమని ఆమె ఇప్పటికే ప్రకటించారు.ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ అతిథి పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version