యధావిధిగా మేము బస్సులు నడుపుతాం : ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు

-

అమరావతి : సమ్మెపై ఏపీ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గంగాధర్ సంచలన ప్రకటన చేశారు. సమ్మె లో మేం పాల్గొనటం లేదని.. యధావిధిగా మేము బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. తమతో పాటు ఏపీ ఆర్టీసీ ముస్లిం, మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఏపీ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కూడా సమ్మె లో పాల్గొనటం లేదని గంగాధర్ సంచలన ప్రకటన చేశారు.

ప్రభుత్వంలో మిమ్మల్ని విలీనం చేసి ఆదుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం తగదని ఫైర్ అయ్యారు. కరోనా కష్ట కాలంలోనూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకున్నారని గుర్తు చేశారు గంగాధర్. వేరే సంఘాలు సమ్మెకు వెళితే మేము బస్సులు నడుపుతామని.. అదనపు డ్యూటీలు చేయాల్సి వచ్చినా మేము సిద్ధమని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గంగాధర్ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news