గత ప్రభుత్వ హయాంలో సెల్ ఫోన్ వెలుతురులో శస్త్ర చికిత్సలు చేయడం చూశాం – సీఎం జగన్

-

గత ప్రభుత్వ హయాంలో సెల్ ఫోన్ లైటింగ్ లో ఆపరేషన్లు చేయడం చూశాం, ఎలుకలు కొరికి చిన్న పిల్లలు చనిపోవడం చూశామన్నారు ఏపీ సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలలో ఆసుపత్రిల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో వైయస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువస్తున్నామని తెలిపారు.

ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలను 3,118 కి పెంచామని వివరించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైద్యరంగంలో 45 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని.. మెడికల్ కాలేజీల కోసం రూ. 12,268 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news