గాంధీ కి వెళ్తే శవం అవుతున్నారు : జగ్గారెడ్డి

-

కరోనా వైరస్ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో అందుతున్న చికిత్సపై గత కొన్ని రోజుల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గాంధీ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులు ఎవరైనా గాంధీ ఆస్పత్రికి వెళ్లారు అంటే శవమై తిరిగి వస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ కరోనా రోగిని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారని… గాంధీ ఆసుపత్రికి పంపొద్దు అని చెప్పినప్పటికీ వైద్యులు అలాగే పంపించారు అంటూ తెలిపారు జగ్గారెడ్డి.

గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆరోగ్య ఈరోజు మరణించాడు అంటూ తెలిపాడు. ఇలా రోజురోజుకు గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయట పడుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వెళితే శవమై తిరిగి రావడమే అని ప్రజల్లో భయాందోళన నిండిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు . సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి భోజనం ఏర్పాటు చేశామని రోగులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామని మంత్రి చెబుతున్నారని… కానీ ఆసుపత్రిలో అవేవి లేవు అంటూ విమర్శించారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులు భర్తీ చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news