షాకింగ్ : గుండెపోటుతో కాంగ్రెస్ చీఫ్ మృతి..!

-

కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ సోమెన్ మిత్రా ఈ తెల్లవారుజామున 1:30 గంటకి గుండెపోటుతో మరణించారు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఈ నెల ప్రారంభంలో కోల్‌కతా నగరంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

78 ఏళ్ల సోమెన్ మిత్రా చౌరంగీ జిల్లాలోని సీల్దా నియోజకవర్గం నుంచి 1972- 2006 మధ్య ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఈయనకి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు.. సోమెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా, మరణానంతరం ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితాలు నెగటివ్ వచ్చినట్టు వైద్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news