అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సంగతేంటి..?

-

ఇటీవలకాలంలో చాలామంది హీరోలు ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంటే.. మరొక సినిమాను సెట్ పై ఉంచుతూ బిజీగా ఉన్నారు. కానీ అక్కినేని వారసుడు అఖిల్ మాత్రం బ్యాచిలర్ సినిమాతో కెరియర్ లోనే మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా ప్రకటించడమే కాకుండా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే శరవేగంగా పూర్తి అవుతున్న సమయంలోనే కరోనా ఈ సినిమాకు అడ్డంకి గా మారింది. అప్పటినుంచి షూటింగ్ స్లోగా అవుతూ వచ్చింది. అయితే ఏజెంట్ సినిమాను ఏ ముహూర్తంలో మొదలుపెట్టాడో తెలియదు కానీ ఇప్పటికీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా.. మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా కోసం అఖిల్ దాదాపు రెండేళ్లకు పైగానే సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నాడు. అయినా కూడా ఈ సినిమా పూర్తి కాలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ.. అఖిల్ సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఏజెంట్ సినిమా తర్వాత ఎవరీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. దీంతో నెక్స్ట్ మూవీ సంగతి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సినిమా ఎలాగో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతోంది కాబట్టి ఒకవేళ ఇది హిట్ అయితే ఆయన రేంజ్ మారిపోవచ్చు. లేదా ఎప్పటిలాగే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలితే ఇక ఆయన తదుపరి చిత్రం రావడం సందేహంగానే మారుతుంది.ఇక అఖిల్ సినిమాల విషయంలో నాగ్ జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి అఖిల్ నెక్స్ట్ ఎవరికి ఓకే చెబుతాడు అనేది ప్రస్తుతం ప్రశాంతంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news