ఉదయం లేవగానే వాటిని చూస్తే మంచిదా.. కాదా..?

-

సాధారణంగా మనకు ఏదైనా కీడు జరిగితే.. ఇవ్వాళ పొద్దున లేచి ఎవరి ముఖం చూశామో అనుకుంటాం. కొన్నిసార్లు మంచి జరిగినా. వావ్ ఇవాళ లేచి నా ముఖమే చూసుకున్నట్టున్నా అని గొప్పలు పోతాం. అసలు పొద్దున లేవగానే ఏం చూడాలి.. ఎవర్ని చూడాలి. కొందరు ఉదయాన్నే లేవగానే వారి చేతులు చూస్తారు. మరికొందరు దేవుడి ఫొటోను చూస్తారు. ఇంకొందరు తల్లిదండ్రులు, పిల్లల ముఖాల్ని చూస్తారు. అసలు లేచిన వెంటనే ఏం చూడాలంటే..

“కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం”

కరాగ్రే వసతే లక్ష్మీ…అంటే  చేయి పైభాగాన లక్ష్మీదేవి…
కర మధ్యే సరస్వతి…మధ్యభాగంలో సరస్వతి
కర మూలే స్థితా గౌరీ… చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు.
ప్రాతః కాలంలో ఈ శ్లోకం చదివి రెండు చేతులూ కళ్లకు అద్దుకుని లేవాలి.

కోట్లాది దేవతలుండగా…నిద్రలేవగానే ఈ ముగ్గురినీ మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలంటే…. 

  • ఏ పని చేసినా చేతి చివరిభాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి. ఎంత కష్టపడితే అంత ఫలితం…అంత డబ్బు నీ సొంతమవుతుంది. అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీసమానం.
  • సరస్వతీ కటాక్షం సిద్ధించాలన్నా…చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకుని చదవాలి. అంటే కరమధ్యే సరస్వతి. చదువుపై ఎంత శ్రద్ధ, పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతీ కటాక్షం అన్నమాట.
  • కరమూలే స్థితా గౌరీ..అంటే…చేతిమూలం మీదే శక్తంతా ఉంటుంది. నేలపై పడినప్పుడైనా, పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మిభాగంలో ఆనుకుని లేస్తాం. అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టుదగ్గరే. అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం. ఆ స్వరూపం గౌరీదేవి. అందుకే కరమూలే స్థితా గౌరీ అని చెబుతారు. జీవితంలో ఎప్పుడైనా కిందపడితే… నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో…జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం.
  • ఒక్కమాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో…మంచైనా, చెడైనా నీ చేతిలోనే ఉంది. అందుకే అంటారు కదా చేతులారా చేసుకున్నావ్ అని. అందుతే ఆ చేతుల్లో కొలువైన్న అమ్మవార్లకి నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే అని చెబుతారు.

నిద్రలేచిన తర్వాత..  నిద్రలేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరువకూడదు. ధర్మ శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతుందని విశ్వాసం.

మన ధర్మ శాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన వారు… తల్లిదండ్రులు, విద్యనేర్పిన గురువులు, కులదైవం, జీవితంలో ఎల్లప్పుడూ మన మేలును కోరుతూ దిశానిర్దేశం చేసే పండితులని, ఆపదలో ఆదుకున్న వారిని, మనస్సుకు నచ్చిన వారిని గుర్తు తెచ్చుకుని వారి పేర్లను తలచుకోవాలి. వారి యోగ క్షేమాలను కోరుకోవాలి. ఇలా తలచుకోవడం వలన ఆ రోజంతా శుభమే జరుగుతుంది.

నిద్రలేవగానే ఇంకా ఎవర్ని చూడాలి..  బంగారం, సూర్యుడు, ఎర్ర చందనం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడిచేయి, ధర్మపత్నిని చూడొచ్చు

నిద్రలేవగానే ఏం చూడకూడదు..  జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను, బొట్టులేని ఆడపిల్లను, ఇంట్లో ఊడ్వని ప్రదేశాలను చూడకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news