కెసిఆర్ సర్పంచులను అవమానిస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

కెసిఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కెసిఆర్ నిన్నటి మాటలు లోకల్ బాడీలను అవమానించేలా ఉన్నాయని అన్నారు. బీజేపీ తో మాకు అనేక విబేదాలు ఉన్నాయి కానీ లోకల్ బాడీలకు నిధులు ఎక్కువ విడుదల చేయాలని పార్లమెంట్లో కోరతాము అన్నారు ఉత్తమ్. కేంద్రం కేసీఆర్ చెప్పినట్లు చేయాలి కానీ.. కెసిఆర్ మాత్రం ఖాజానా లూటి చేయడమే పనిగా పెట్టుకున్నాడు అని విమర్శించారు. కేంద్రం నేరుగా నిధులు ఇవ్వద్దు అనే దాని వెనుక కెసిఆర్ నిర్వాకం ఉంది అన్నారు.

సర్పంచులను ఎక్కువగా అవమానిస్తుంది కేసీఆర్ ఒక్కరే అని మండిపడ్డారు ఉత్తమ్. గ్రామ పంచాయతీల నిధులు సర్పంచులకు సంబంధం లేకుండా ఎలా నిధులు ఖర్చు చేస్తున్నారు అని ప్రశ్నించారు. కేంద్రం చేస్తే తప్పు అంటారు.. కెసిఆర్ మాత్రం సర్పంచులకు సంబంధం లేకుండా నిధులు ఖర్చు చేస్తారు అని అన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అన్నారు ఉత్తమ్. అందరూ నా దగ్గరికి రావాలనే ఆలోచన తప్పని.. స్థానిక ప్రజా ప్రతినిధులు సీఎం వ్యాఖ్యలను ఖండించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news