మాటల మాంత్రికుడితో మహేశ్ మూవీ.. రాజమౌళి తర్వాత? ముందా?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మహేశ్ అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 12న పిక్చర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మహేశ్ అభిమానులు ‘సర్కారు వారి పాట’ పిక్చర్ చూసేందుకు రెడీ అయిపోతున్నారు. కాగా, మహేశ్ నెక్స్ట్ మూవీస్ గురించి కూడా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ పిక్చర్ సెట్స్ పైన ఉండగానే మహేశ్ తన నెక్స్ట్ రెండు సినిమాలపైన అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నారు మహేశ్. ‘అతడు, ఖలేజా’ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న పిక్చర్ SSMB28.

ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. కానీ, షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయమై క్లారిటీ రావడం లేదు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తో మహేశ్ సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమా తర్వాత త్రివిక్రమ్ చేయాల్సి వస్తే ఏళ్ల సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు టాక్. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news