సునీతమ్మకు చంద్రబాబు ఏ సీటు ఇస్తారు?

-

ఇటీవల ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకా కేసు విషయంలో ఎలాంటి సంచలన విషయాలు బయటకొస్తున్నాయో తెలిసిందే..ఇక సి‌బి‌ఐ పరిధిలో ఉన్న ఈ కేసు గురించి పక్కనబెడితే…దీనిపై రాజకీయంగా పెద్ద రచ్చ జరుగుతుంది…ఇక వివేకా కేసులో ముద్దాయిలు దొరికేసారని చెప్పి టీడీపీ ఆరోపణలు చేస్తుంది..ఇదే సమయంలో వైఎస్ వివేకా కుమార్తె సునీత స్టేట్‌మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయో అందరికీ తెలిసిందే. జగన్‌కు ఇబ్బంది కలిగేలా ఆ స్టేట్‌మెంట్స్ ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సునీతమ్మ స్టేట్‌మెంట్స్ విషయంలో సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.. వివేకానందరెడ్డి హత్యను ఆయన కుమార్తె సునీత పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తోందని, ఆధారంలేని ఆరోపణలు చేస్తోందని సజ్జల అన్నారు. వివేకా హత్య విషయంలో జగన్ వైపు వేలెత్తి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇక ఈ కథ మొత్తం చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరుగుతుందని, అసలు ఇదంతా చూస్తుంటే వివేకా కుమార్తె సునీత.. చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనిపిస్తోందని చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఆమె టీడీపీ తరఫున పోటీ చేస్తుందన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. అయితే సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ నుంచి కూడా కౌంటర్లు వచ్చేస్తున్నాయి. సజ్జల వైఖరి చూస్తుంటే రేపో మాపో వైఎస్‌ విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు పావులని అంటారేమోనని టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.

అయితే సునీతకు టీడీపీ టిక్కెట్ ఇవ్వొచ్చని సజ్జల పదే పదే చెబుతూ వస్తున్నారు…అసలు సజ్జల చేసే విమర్శలు కాస్త వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు…సునీతమ్మ రాజకీయాల్లోకి రారని,కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలని డైవర్ట్ చేయడానికి చంద్రబాబుని బుక్ చేయడానికి, సునీతమ్మకు టీడీపీ టిక్కెట్ అంటున్నారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. పోనీ సజ్జలనే సునీతమ్మకు టీడీపీలో ఫిక్స్ చేస్తున్నారని, ఇక పోటీ చేసే సీటు కూడా ఏదో చెబితే బాగుంటుందని అంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకా హత్యకేసు సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news