మంత్రికి తక్కువ ఎమ్మెల్యేకు ఎక్కువ అన్న విధంగా రోజా ఉంటున్నారన్నది విపక్షం ఆరోపణ.మూతి పగులుద్ది అన్న డైలాగ్ ను రోజా వాడి, వాడీ వేడీ రాజకీయాలకు మరింత కొనసాగింపు ఇచ్చారు.దీంతో నగరి టీడీపీ భగ్గుమంది.అసలే ఇంటిపోరుతో అలసట చెందుతున్న రోజాగా టీడీపీలో ఉన్న పెద్ది రెడ్డి వర్గం మరింత తలనొప్పిగా మారారు. పెద్దిరెడ్డి కూడా అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ రోజాకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ తనదైన రాజకీయం నడుపుతున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ కష్టమే అని కూడా అంటున్నారు. వాస్తవానికి వైసీపీ ఆర్థిక వ్యవహారాలకు వెన్నుదన్నుగా ఉండే పెద్దిరెడ్డి ఓ దశలోసీఎం కావాలని ఆ విధంగాతన చిరకాల ప్రత్యర్థి చంద్రబాబుకు చెక్ పెట్టాలని కలలు కన్నారు.ఒకవేళ రేపటి వేళ షర్మిల ఆంధ్రా కేంద్రంగా పార్టీ పెడితే అది తప్పక జగన్ కు ఇబ్బందే! అప్పుడు పెద్ది రెడ్డి వర్గం రోజాను మరింత ఇబ్బంది పెట్టేందుకు షర్మిల వైపు వెళ్లినా వెళ్తారు.
