అస్సాం సీఎంకి నోటీసులు ఇవ్వు..లేదంటే హైదరాబాద్ కమిషనరేట్ ని ముట్టడిస్తా : రేవంత్‌

-

రాహుల్‌ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి బిస్వాంత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్‌ కు రేవంత్‌ ఛాలెంజ్‌ విసిరారు. దమ్ముంటే అస్సాం ముఖ్యమంత్రి కి నోటీసులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్ మీరు అస్సాం సీఎం మీద… బీజేపీ మీద కొట్లాదేది నిజమే అయితే పోలీసుల మీద ఒత్తిడి చేయకండని పేర్కొన్నారు.

మేము ఇచ్చిన ఫిర్యాదుల పై కేసులు నమోదు చేస్తారని తెలిపారు. పోలీసులు 24 గంటల్లో కేసు నమోదు చేయాలని… అస్సాం సీఎంకి నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్ మీకు చిత్తశుద్ధి వుంటే తక్షణమే స్పెషల్ టీం ఏర్పాటు చేయండని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

ఈ నెల 16వ తేదీ వరకు కేసు నమోదు చేయకపోతే కమిషన్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. తాను హైదరాబాద్ కమిషనరేట్ ని ముట్టడిస్తానని… కాంగ్రెస్ శ్రేణులు… ఆందోళనకు సిద్దం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news