సమావేశం మధ్యలోనే ఢిల్లీకి బయలుదేరిన పవన్ కల్యాణ్..

-

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ప్రధానంగా అమరావతి తరలింపుపై స్పష్టత వస్తే ఏమి చెయ్యాలన్న దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అమరావతిలో రైతుల తరుపున పోరాటం చెయ్యాలని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగా సంక్రాంతి తరువాత విజయవాడ నగరంలో లక్షమందితో కవాతు నిర్వహించే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

 

జనసేన విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వం ప్రముఖుల అపాయింట్‌మెంట్‌ పవన్‌ కల్యాణ్‌కు ఖరారయిందని అందుకే వెళ్లారని జనసేన నేతలు అంటున్నారు. దీంతో ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఏ విష‌యంలో క‌లుస్తున్నారు అన్న‌దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, అమరావతి ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని ప్రచారం కూడా జరుగుతోంది. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ నిన్న (శుక్రవారం) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news