ఆస్తి కోసం రెండో భర్త హత్యకు ప్లాన్‌.. రంగంలోకి టాప్‌ షూటర్‌.. చివరికి

-

నేటి సమాజంలో రోజురోజుక బంధాలకు విలువ లేకుండా పోతోంది. స్పష్టత లేని నిర్ణయాలతో జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ తన రెండో భర్త మీద కు తెలియకుండా మరో పెళ్లైన వ్యక్తితో వివాహేత సంబంధం పెట్టుకుంది. రిషిపాల్ శర్మ, పూజ సింగ్ ఇద్దరు భార్య భర్తలు. వీరు నోయిడాలో ఉంటున్నారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. ఈ క్రమంలో పూజసింగ్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. అఖీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. పూజసింగ్ కు మొదటి భర్తతో ఉన్నప్పుడు విశాల్ సింగ్ పుట్టాడు. ఈ క్రమంలో మొదటి భర్తలో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత.. రిషిపాల్ ను రెండో పెళ్లి చేసుకుంది.

Murder under Indian Penal Code: All you need to know about it

కాగా రెండో భర్త ఆస్తికి నొక్కెయాలని పూజ సింగ్, తన కొడుకుతో కలిసి, రెండో భర్త హత్యకు ప్లాన్ వేశారు. తన ప్రియుడు అఖీల్ కు, పూజ చెప్పింది. దీంతో వారు.. ఫ్రొఫెషనల్ షూటర్ హసన్ ను దీని కోసం రెడీ చేసుకున్నారు. రిషిపాల్ శర్మ.. ఆఫీస్ నుంచి తన ఇంటికి వస్తుండగా.. మే 10 న ఇద్దరు దుండగులు.. సెక్టార్ 126 వద్ద కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరిని అనుమానస్పదంగా ఉండటంతో వారిని అదుపులోనికి తీసుకొని విచారించారు. దీంతో ఈ మాస్టర్ ప్లాన్ రెండో భార్య, అతని కుమారుడు, ప్రియుడి దేనని విషయం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news