ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యంగ్య వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మహిళ

-

గడగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ప్రజలు నాయకులను నిలదీస్తుండగా.. మరికొన్నిసార్లు నేతలే ప్రజలపై ఫైర్ అవుతున్నారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ మహిళపై వంశీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ గ్రామీణ మండలం నిడమానూలో ఓ మహిళ.. ‘గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. మీ జగన్‌ను అడిగి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకురండి’.. అని సూచించారు. దీనికి స్పందించిన వంశీ ‘చూడండి అక్కా.. మీరు ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలను బాగా చూస్తున్నట్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. దానికి ఆ మహిళ ‘మీరు పెద్దవాళ్లు అయ్యింది ఆ పత్రికల వల్లనేగా’ అంటూ ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు. దీంతో తమాయించుకున్న వంశీ మాట్లాడుతూ.. ‘ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోవడంతో చాలా కంపెనీలు వెళ్లిపోయాయి’ అని వివరించారు. దీనికి ఆమె ‘ఇంకా హైదరాబాద్‌నే అభివృద్ధి చేయాలని చూస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల గురించి ఎమ్మెల్యే వంశీ మహిళలతో మాట్లాడుతుండగా వాలంటీరు ఫొటోలు తీశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా.. వ్యక్తిగత సిబ్బంది ఆ ఫొటోలను డిలీట్‌ చేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news