నిన్న విశాఖ ఆర్‌కే బీచ్‌లో గల్లంతు.. ఇవాళ నెల్లూరులో ప్రత్యక్షం

-

విశాఖ ఆర్కే బీచ్‌లో ఓ గల్లంతైన ఓ వివాహిత సాయిప్రియ ఇవాళ నెల్లూరులో ప్రత్యక్షమైంది. ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండ్రోజుల పాటు తీవ్రంగా గాలించారు. చివరకు ఇవాళ ఆమెను నెల్లూరులో గుర్తించారు. ఓ యువకుడితో పాటు సాయిప్రియ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

‘విశాఖ ఎన్​ఏడీ కి చెందిన చిరిగిడి సాయిప్రియ (21) విజయవాడకు చెందిన శ్రీనివాసరావు భార్యాభర్తలు. భర్త శ్రీనివాసరావు వృత్తి రీత్యా హైదరాబాద్​లో ఉంటున్నారు. వారం రోజుల క్రితం సాయిప్రియను కలవడానికి శ్రీనివాసరావు విశాఖకు వచ్చారు. సోమవారం వారి పెళ్లి రోజు కావటంతో సరదగా ఆర్కే బీచ్​కు వెళ్లారు. శ్రీనివాసరావు బీచ్ ఒడ్డున ఉండగా.. సాయిప్రియ సముద్రంలోకి వెళ్లింది. శ్రీనివాసరావు ఫోన్ చూసుకుంటుండగా.. సాయిప్రియ అలలతాకిడికి సముద్రంలో గల్లంతైంది.’ అని పోలీసులు తెలిపారు.

ఆమె భర్త ఫిర్యాదు అందుకున్న త్రీ టౌన్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. బీచ్‌ పరిసరాల్లో ఎంత వెతికినా ఆచూకీ కనిపించకపోవటంతో.. ఇవాళ ఉదయం కోస్ట్​ గార్డుకు చెందిన ఒక హెలికాప్టర్, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆమె నెల్లూరులో ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆమె ఓ యువకుడితో కనిపించింది. బీచ్‌లో గల్లంతై.. నెల్లూరులో ఎలా ప్రత్యక్షమైందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news