స్టార్‌ హీరోయిన్‌ కు ఈడీ నోటీసులు

-

బాలీవుడ్‌ స్టార్‌ నటి యామీ గౌతమ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో ఈ నోటీసులు జారీ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం ఉల్లంఘనలకు యామీ గౌతయ్‌ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు.. చేపట్టిన ఈడీ తాజా ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జులై 7న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. యామీ గౌతమ్‌ ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి నోటీసులు అందుకున్నారు.

ఇక అటు బాలీవుడ్‌ పెద్ద నిర్మాణ సంస్థలపై ఇప్పటికే ఈడీ నిఘా పెట్టింది. విదేశీ లావాదేవీలపై ఓ కన్నేసింది ఈడీ. కాగా… ”ఉల్లాస ఉత్సాహ” అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది యామీ గౌతమ్‌. ఆ తర్వాత బాగా పాపులరైన ఈ భామ.. పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. విక్కీ డోనర్‌, యాక్షన్‌ జాక్సన్‌, బద్లాపూర్‌, ఉరి, బాలా చిత్రాలలో ఆమె ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇటీవలే ఆమె ఉరి మూవీ డైరెక్టర్‌ ఆదిత్యను పెళ్లి చేసుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news