అవినీతి, ఫ్యాక్షన్, ఆర్థిక నేరాలు చేయడమే.. జగన్ క్యారెక్టర్ : యనమల

-

అవినీతి, ఫ్యాక్షన్, ఆర్థిక నేరాలు చేయడమే.. జగన్ క్యారెక్టర్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒంగోలులో మహానాడు నిర్వహణకి టీడీపీ నిర్ణయించిందని.. ఒంగోలు మినీ స్టేడియం లో మహానాడు పెడతామంటే జగన్ భయపడుతున్నాడని చురకలు అంటించారు. ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు నిర్వహణకి కలెక్టర్ అనుమతించలేదని.. కలెక్టర్లు ఉండేది జగన్ చెప్పినవి చెయ్యడానికి కాదు..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలిపారు.

మూడేళ్లలో అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. రాష్ట్రంలో సహజ సంపద జగన్ దోచేస్తున్నాడని విమర్శించారు. 8 లక్షల కోట్లు జగన్ ఇప్పటికే అప్పులు చేశాడు.. దిగిపోయే సమయానికి అప్పు 11 లక్షల కోట్లకు చేరుతుంది..మహానాడులో ప్రజా సమస్యలు చర్చిస్తామన్నారు.

తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్ అక్రమంగా సంపాదించిన లక్ష కోట్లు ప్రభుత్వ ట్రెజరీలో జమ చెయ్యాలని.. జగన్ దాచిపెట్టిన అవినీతి సొమ్ముతో రాష్ట్రాన్ని అభివృద్ది చెయ్యెచ్చని వెల్లడించారు. గడపగడప కి వెళ్లిన ఎమ్మెల్యేలని జనం ఛీకొడుతున్నారని.. అవినీతి, ఫ్యాక్షన్, ఆర్థిక నేరాలు చేయడం జగన్ క్యారెక్టర్ అన్నారు. అధికారం పోతుందన్న బెంగ జగన్ కి పట్టుకుందని.. ఇలాంటి నాయకులకు అధికారం ఇచ్చి ప్రజలు నష్టపోకూడదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news