వైసిపి దళిత వ్యతిరేక ప్రభుత్వం – చంద్రబాబు

-

తనకు ఓటు వేసి గెలిపించిన దళితులపైనే జగన్ సర్కారు దాడులు చేస్తుందని ఆరోపించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ ఎస్సీ వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గుడివాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అప్పుడేమో ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు.. ఎస్సీ కుటుంబాలలో ఒక్కరికే అమ్మబడి ఇస్తున్నారని ఆరోపించారు.

అన్ని కులాల కంటే ఎక్కువ పేదరికం ఎస్సీలలోనే ఉందన్నారు చంద్రబాబు. ఎస్సీలకు తాను ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని పథకం పెడితే.. దాన్ని జగన్ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలు పెంచి ఎస్సీలపై భారం మోపారన్నారు చంద్రబాబు. చరిత్రలో దళితులపై ఎప్పుడు జరగనన్ని దాడులు ఇప్పుడే జరుగుతున్నాయన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని.. దళితులకు ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కు నిజమైన వారసుడు ఎన్టీఆరే నని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news