ఏపీలో అరాచాకం…స్వతంత్ర అభ్యర్ధి కుటుంబం మీద వైసీపీ అభ్యర్ధి కుటుంబం దాడి !

-

ఏపీ పంచాయతీ ఎన్నికల తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేతల అరాచకాలు మాత్రం ప్రతి రోజు ఏదో ఒక విషయంలో బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది..పంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంట చంద్రకళ అనే మహిళ  మరిది మీద వైసీపీ అభ్యర్థి కుటుంబ సభ్యులకు కత్తులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది.

దాదాపు ఎనిమిది చోట్ల లోతుగా కత్తి పోట్లు పడడంతో అతనిని రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి రాజోలు వైద్యాధికారులు రిఫర్ చేశారు. దీంతో అతనిని హుటాహుటిన అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది అనే అంశం మీద వారు దర్యాప్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news