సొంత పార్టీ మంత్రులపై ఫైరవుతున్న వైసీపీ ఎమ్మెల్యే…!

-

ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట. నియోజక వర్గంలో అనుకున్న పనులు కావడం లేదని జిల్లా మంత్రుల పై గిద్దలూరు ఎమ్మెల్యే ఓ రేంజ్ లో ఫైరవుతున్నారట. నియోజక వర్గంలో తాను చెప్పిన వారికి కాకుండా ఇతరులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంపై కూడా ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

సివిల్ కాంట్రాక్టర్ అయిన అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గిద్దలూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన అన్నా రాంబాబు ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అన్నా రాంబాబు 82 వేల భారీ మెజారిటీతో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారీ మెజారిటీతో గెలుపొందడంతో అన్నా రాంబాబు నియోజక వర్గంలో తిరుగులేదని భావించాడు. కానీ నియోజక వర్గంలో అలాంటి సీన్‌ కనిపించటం లేదట. నియోజక వర్గంలో అన్నా రాంబాబు చెప్పిన పనులు చేయడానికి అధికారులు సహకరించడం లేదట. దీనిపై జిల్లా మంత్రి బాలినేనికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని అన్నా అసంతృప్తిగా ఉన్నారట.

గిద్దలూరు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవి విషయంలో కూడా రాంబాబు చెప్పిన వారిని పక్కన పెట్టారని ఫీలైపోతున్నారట. కంభం మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి ఇవ్వాలని తన అనుచరుడి పేరు అన్నా రాంబాబు చెప్పారట. కానీ టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి జోక్యంతో ఆ పదవిని అన్నా రాంబాబుతో సంబంధం లేకుండా వెంకటేశ్వర్లు అనే మరో నాయకుడికి కట్టబెట్టారట. తన నియోజక వర్గంలో పదవులు కూడా పార్టీ నేతలే ఫిలప్ చేస్తే…నియోజక వర్గంలో ఇక తానెందుకని అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అటు నియోజక వర్గంలో, పార్టీలో తనకు పనులు కావడం లేదని, ఆఖరికి కరోనా చికిత్స కోసం ఇచ్చిన తన కాలేజీని కూడా ధ్వంసం చేసి అప్పగించారని ఒంగోలులో జరిగిన డీఆర్సీ మీటింగ్ లో మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు ఎదుట అన్నా రాంబాబు తన ఆవేదన వ్యక్తం చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news