బాలయ్య కోసం వైసీపీ కొత్త స్కెచ్..వర్కౌట్ అవుతుందా?

-

హిందూపురం…తెలుగుదేశం పార్టీ కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ టీడీపీ ఇంతవరకు ఓడిపోలేదు. 1983 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూనే ఉంది. పైగా హిందూపురం అంటే నందమూరి ఫ్యామిలీ అడ్డా…గతంలో ఇక్కడ ఎన్టీఆర్ సత్తా చాటగా, ఆ తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ దూసుకెళుతున్నారు. గత రెండు పర్యాయాల నుంచి బాలయ్య హిందూపురంలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇక్కడ బాలయ్యకు చెక్ పెట్టాలని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం స్థానంపై ఫోకస్ పెట్టి అక్కడ చంద్రబాబుకు ఏ విధంగా చెక్ పెట్టడానికి చూస్తున్నారో తెలిసిందే. అలాగే హిందూపురంపై ఫోకస్ చేసి బాలయ్యకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు అనేక రకాల స్కెచ్‌లతో బాలయ్యని ఓడించాలని చూస్తున్నారు. ఎలాగో అధికారంలో ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.

దీంతో బాలయ్య పని అయిపోయిందనుకుంటే పొరపాటే..ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ లోకల్ ఎన్నికల్లో గెలిచింది. సాధారణ ఎన్నికలోచ్చేసరికి పరిస్తితి మారిపోతుంది. ఇక్కడ బాలయ్యని దాటి వేరే నాయకులని గెలిపించడం కష్టం. అందుకే బాలయ్యని నెగిటివ్ చేసేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ప్రతి ఇష్యూలోనూ వైసీపీ నేతలు బాలయ్య ఇంటిని ముట్టడిస్తున్నారు. తాజాగా ఒక డంపింగ్ యార్డు విషయంలో వైసీపీ నేతలు, బాలయ్య ముందు హడావిడి చేశారు. అధికారంలో ఉన్నది వైసీపీ..సమస్యని పరిష్కరించాల్సింది వైసీపీ…అయినా సరే వారు బాలయ్యని టార్గెట్ చేశారు.

అదే సమయంలో టీడీపీ నేతలు సైతం బాలయ్య ఇంటికొచ్చి వైసీపీ నాయకులని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతల హడావిడి విఫలమైంది. అంటే ఏదొక విధంగా బాలయ్యపై నెగిటివ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యపడదని హిందూపురం బరిలో బాలయ్యని ఓడించడం వైసీపీకి సాధ్యం కాదని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news