కౌంటింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి : సజ్జల

-

ఎన్నికల కౌంటింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం పై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేశారు.  కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ ఇచ్చేంత వరకు ఎవ్వరూ బయటికి రావద్దని సూచించారు. దేశంలో లేని నిబంధనలు ఏపీలోనే ఉన్నాయని తెలిపారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధన పెట్టారు. 

చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు అరెస్ట్ గురించి ఎక్కడైనా ప్రస్తావన వినిపించిందా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి తిట్టడం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్ట్ గురించి ఎవ్వరైనా పట్టించుకున్నారా.? అని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తప్పే. మెజార్టీ సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. మరోసారి సీఎం గా జగన్ ప్రమాణం చేస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news