దువ్వాడ స్టేషన్‌లో రైలు కింద ఇరుక్కున్న యువతి..వీడియో వైరల్

-

దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఓ ఎంసిఏ విద్యార్థిని ప్లాట్ ఫామ్ రైలు మధ్య ఇరుక్కుపోయింది. బయటకు రాలేక రెండు గంటల పాటు అలాగే ఉండిపోయింది. చివరికి ప్లాట్ ఫామ్ ను బద్దలు కొట్టి ఆమెను రక్షించాల్సి వచ్చింది. అన్నవరానికి చెందిన 20 ఏళ్ల శశికళ దువ్వాడ లోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.

రోజు వారిలానే గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రైలులో దువ్వాడ చేరుకుంది. స్టేషన్ లో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ కిందికి జారిపడింది. దీంతో ప్లాట్ ఫామ్ రైలు మధ్య ఇరుక్కుపోయింది. బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ విఫలమైంది. ప్రయాణికులు కూడా ఆమెను బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి సమాచారం అందుకున్న రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కుపోయిన చోట ఫ్లాట్ ఫామ్ ను బద్దలు కొట్టి ఆమెను రక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news