జగిత్యాలలో టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

-

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగరవేశారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. నూతన టిఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ప్రస్తుతం వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మోతే శివారులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news