చెల్లెల్ని ప్రేమించాడని యువకుడిని నరికి కుక్కలకు ఆహారంగా వేసిన అన్న..

-

అత్యాచారం, ప్రేమించిన అమ్మాయి కాదంటే యాసిడ్‌ దాడి, గృహహింసలు ఇవన్నీ ఒకవైపు ఉంటే.. అరుదుగా నిజమైన ప్రేమికులు ఉన్నారు.. కానీ వారిని సమాజం ఒప్పుకోవడం లేదు. ఇంట్లో వాళ్లు ప్రేమను ఒప్పుకోక వారిని హతమారుస్తున్నారు. పరువు హత్యలు కూడా దేశంలో పేట్రేగిపోతున్నాయి. పరువు కోసం ఓ యువకుడు నరరూప రాక్షసుడి అవతారమెత్తాడు. కేవలం తన చెల్లెల్ని ప్రేమించాడనే విషయాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తిని చంపి అతని శవాన్ని కుక్కలకు వేశాడు.

ఢిల్లీలో శ్రద్దా వాకర్‌ అనే యువతిని ప్రేమించిన వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన యావత్‌ దేశాన్ని వణికించింది.. ఆ ఘటన తర్వాత అలాంటి నేరాలే జరుగుతున్నాయి. ఇప్పుడు బీహార్‌లో తన సోదరిని ప్రేమించిన యువకుడ్ని నరికి చంపి ..ముక్కల్ని కుక్కలకు వేశాడో ఓ అన్న..నలంద జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన తర్వాత పోలీసులే షాక్ అవుతున్నారు.

బీహార్‌ రాష్ట్రం నలంద జిల్లాలో రాహుల్ అనే యువకుడు దారుణానికే పాల్పడ్డాడు. బిట్టు కుమార్ అనే ఓ యువకుడ్ని రాహుల్ నరికి చంపాడు. అటుపై బిట్టు కుమార్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు. శరీరంలోని పెద్ద భాగాలను దగ్గరలోని నదిలో పడేశాడు.. ఇంత కృరంగా ఎలా చేయగలిగాడు.. ఎవరిచ్చారు తనకా హక్కు.. ఓ వ్యక్తిని ఇలా చంపి పారేయడానికి..

అసలేం జరిగిందంటే..

బిట్టుకుమార్‌ రాహుల్‌ సోదరిని ప్రేమించాడు. ఇద్దరూ క్లోజ్‌గా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన రాహుల్ ఎలాగైనా తన సోదరిని ప్రేమించిన వాడ్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే డిసెంబర్‌ 16వ తేదిన ఇంటి నుంచి బయటకు వచ్చిన బిట్టుకుమార్‌ని మాట్లాడాలని రమ్మని చెప్పి నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే బిట్టుకుమార్‌ని దారుణంగా నరికి చంపాడు. అటుపై మృతదేహం ముక్కల్ని కుక్కలకు వేశాడు. బిట్టు కుమార్ ఈనెల 18వ తేది వరకు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగానే రాహుల్‌ని అనుమానించారు.

పరువు హత్యగా నిర్దారణ..

బిట్టుకుమార్‌ మర్డర్‌ వెనుక ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చన్న అనుమానంతో రాహుల్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టడంతో తానే బిట్టుకుమార్‌ని హతమార్చినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. రాహుల్‌పై మర్డర్ కేసు నమోదు చేశారు. నదిలో పడేసిన బిట్టుకుమార్ మృతదేహం శరీర భాగాల కోసం ఇంకా గాలిస్తున్నారు.

ఈ కేసును పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కేవలం తమ కంటే కిందిస్థాయి వ్యక్తి తన సోదరిని ప్రేమించాడనే కోపంతోనే రాహుల్‌ ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లుగా తేల్చారు. అయితే హత్య కేసులో రాహుల్ ఒక్కడే నిందితుడు ఉన్నాడా లేక ఎవరైనా సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే బిట్టుకుమార్‌ మాత్రమే ప్రేమించాడా.. లేక తన చెల్లెలు కూడా ప్రేమించిందా..? అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news