‘యువగళం’ పేరుతో నారా లోకేశ్‌ పాదయాత్ర.. 400 రోజులు 4వేల కిలోమీటర్లు

-

తెలుగు దేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రకు యువగళం పేరును నిర్ణయించారు. వచ్చే నెల 27 నుంచి లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. మొత్తం 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను తెదేపా నేతలు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు లోకేష్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news