యాసిడ్ బాధితులకు ఆసరా ఇస్తున్న యువతి..!

-

అగ్నిప్రమాదాలుకు ఏటా ఎంతోమంది బలవుుత్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు బాడీలో అవయవాలను కోల్పోయి మానసికంగా కుంగిపోతున్నారు. కాలం కలిసిరాక జరిగే ప్రమాదాలు ఒక ఎత్తు అయితే.. ప్రేమించలేదనే కోపంతోనే, మరేదైనా కారణంతో జరిగే యాసిడ్ ఘటనలు మరొక ఎత్తు. ఇలాంటివి జరిగినప్పుడే వారి గురించి పట్టించుకుంటారు.. నాలుగు రోజులైతే.. యదామామూలే.. ఆ గాయలతో బాధితులు ఎంతో బాధను ఎదుర్కొంటూ జీవితం గడుపుతుంటారు. వీరి గురించి పట్టించుకునేవాళ్లు చాలా అరుదు. వీరి కోసం… ఓ మహిళ ముందుకొచ్చింది. యాసిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తూ.. పునరావాసాన్ని కల్పిస్తుంది. ఈ కథ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మేనేజ్‌మెంటు కోర్సు చేయడానికి దిల్లీ నుంచి తానియాసింగ్ సింగపూర్‌ వెళ్లింది. తన అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైంది. ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా ఫలితం కనిపించక, తిరిగి దిల్లీకి వచ్చేసింది. తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రులకు వెళ్లినప్పుడు అక్కడ సమయానికి చికిత్స అందక యాసిడ్‌, అగ్నిప్రమాద బాధితులు కొందరు చనిపోవడం తానియా కళ్లారా చూసి చలించిపోయింది. భరించలేకపోయింది. ఇటువంటి వారికోసం ఏదైనా చేయాలనుకుంది.
వీరికి ఏదైనా సాయం చేయాలనుకుని తానియా.. ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తూ.. రియాశర్మ గురించి తెలుసుకుంది. యాసిడ్ బాధితులకు తన వంతు సేవలందిస్తున్న రియాశర్మకు తానియా.. లక్ష రూపాయలు విరాళంగా ఇద్దామనుకుంది.. కానీ అందుకు రియాశర్మ ఒప్పుకోలేదు. ఆసక్తి ఉంటే.. తాను ప్రారంభించిన ‘మేక్‌ లవ్‌ నాట్‌ స్కేర్స్‌ ‘ఎన్జీవోకు సహకరించమని అడిగింది. బాధితులకు పునరావాసాన్ని కల్పించడంలో కలిసి పని చేద్దామంది. అలా ఈ సేవలో తానియా భాగస్వామినయ్యా.

దిల్లీలో పునరావాసకేంద్రం..

ఇద్దరం కలిసి దిల్లీలో పునరావాసకేంద్రాన్ని ప్రారంభించారు.. యాసిడ్‌ బాధితులను కలుసుకొని వారి ఇబ్బందులు, సమస్యలను తెలుసుకునేవాళ్లం. ఈ క్రమంలోనే డబ్బు అవసరంపడింది.. మళ్లీ సింగపూర్ వెళ్లి ఉద్యోగంలో చేరింది. వారాంతంలో దిల్లీ వచ్చి ఇక్కడ సేవలందించేదట.. కానీ ఇలా మేనేజ్ చేయడానికి సమయం సరిపోయేది కాదు.. దాంతో మూడు నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ దిల్లీ వచ్చేసింది తానియా..
2016లో యాసిడ్‌, అగ్నిప్రమాద బాధితులు నివసించడానికి సౌకర్యాలతో కూడిన ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలోనే తొలి రెసిడెన్షియల్‌ ఫెసిలిటీ సెంటర్‌ అది. బాధితులెవరైనా ఇక్కడ ఉండొచ్చు. వారికి శారీరక, మానసికారోగ్యాన్ని పరిరక్షించేలా ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు యోగా, ధ్యానం వంటివి చేయిస్తారు. వారి కాళ్లపై వారు నిలబడేలా హస్తకళల్లో శిక్షణ ఇప్పిస్తారు.. వారి పిల్లలను పాఠశాలలో చేర్పించి విద్య అందిస్తారు. వీటికంతా క్రౌడ్‌ ఫండ్‌ను ఆశ్రయిస్తున్నట్లు తానియా తెలిపింది.. బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ స్థాపించిన మీర్‌ ఫౌండేషన్‌ సాయంతో బాధితులకు శస్త్రచికిత్సలూ చేయిస్తున్నారట.
యాసిడ్‌ దాడులను నియంత్రించాలంటే ముందుగా యాసిడ్‌ విక్రయాలను నిషేధించాలనే ఆలోచనతో ‘స్లాష్‌ ఎండ్‌ యాసిడ్‌సేల్‌’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు తానియా, రియా బృందం. బాధితులతో తీసిన వీడియోలను విడుదల చేశారు. 2015లో ఈ వీడియోలను మూడున్నర లక్షలమంది వీక్షించడమే కాదు, ఈ అంశంపై కోర్టులో పిటీషన్‌ దాఖలు కావడానికి ఆన్‌లైన్‌లో తమ మద్దతునూ కూడా తెలిపారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై స్పందించింది. అదే ఏడాది డిసెంబరులో యాసిడ్‌ విక్రయాలను నిలిపేయాలంటూ, ఫలానా సంస్థ ఐడీ కార్డు ఉంటే మాత్రమే యాసిడ్‌ కొనడానికి అర్హత ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తానియా ఇప్పటివరకు 100 మందికిపైగా యాసిడ్‌ బాధితులకు చేయూతగా నిలిచిందట.
సమాజానికి సేవ చేసే వాళ్లుచాలా అరుదుగా ఉంటారు. సేవ చేయడానికి ఉద్యోగం అడ్డుగా ఉందని.. వదిలేసింది. ఈరోజుల్లో ఇలాంటి వారు ఉండటం అంటే గొప్ప విషయమే.. మనం అలా చేయలేకపోయినా.. కనీసం.. మనకు తోచినంత సాయం.. ఆపదలో ఉన్నవారికి ఆదుకునేందుకు సిద్దంగా ఉంటే చాలు. ఏమంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news