పార్టీలో ఉంచుకుంటే ఉంచుకో… పీక్కుంటే పీక్కో – రఘురామ కృష్ణం రాజు

-

పార్టీలో ఉంచుకుంటే ఉంచుకో… పీక్కుంటే పీక్కో అంటూ వైసీపీ పార్టీపై రెచ్చిపోయారు రఘురామ కృష్ణం రాజు. దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారిని సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్న వారిపై సైబర్ చట్టం ప్రకారమే కాకుండా, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టులు చేయాలని రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు.

శ్రీదేవి గారు తన ఇద్దరు కూతుర్లతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసభ్యంగా, అసహ్యంగా, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా కామెంట్లు పెడుతున్నారని, ఇలా కామెంట్లు పెడుతున్న వారికి స్త్రీ జాతి అంటే గౌరవం లేదా?, ఏమీ లేని దానికే సుమోటోగా కేసులు నమోదు చేసే ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు, జగన్ మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఇప్పుడు ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు.

ఆ పార్టీకి చెందిన వారిపై ఏమి మాట్లాడినా పైన పడిపోయే సీఐడీ పోలీసులు, ఒక దళిత శాసన సభ్యురాలిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతుంటే ఎందుకని చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో ఈ రకమైన కామెంట్లు ఎవరు పెడుతున్నారో, వారి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ, మౌనం దాల్చడం దారుణమని, ఈ తరహా కామెంట్లు చేస్తున్న ముష్కరులను తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉండవల్లి శ్రీదేవి గారికి, తనకి ఒక న్యాయం జగన్ మోహన్ రెడ్డి గారికి మరొక న్యాయమా?, పేరు చివరన తోక ఉంటే వారు ఎవరిపైన ఎటువంటి కామెంట్స్ అయినా పెట్టవచ్చా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news