డబ్బులు ఉన్నవారికే టీఆర్ఎస్ రాజ్యసభ స్థానాలు ఇచ్చింది: వైఎస్ షర్మిళ

-

డబ్బులు ఉన్నవారికి మాత్రమే టీఆర్ఎస్ రాజ్యసభ స్థానాలను ఇచ్చిందని విమర్శించారు వైఎస్సార్టీపీ నేత వైఎస్ షర్మిళ. రూ. 860 కోట్లు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉంటే..  ఆ పార్టీ నేతల ఎకౌంట్లో ఇంకా ఎన్ని డబ్బులు ఉంటాయో అని అన్నారు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఎందుకు తీరదని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ కావడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం అని ఆమె అన్నారు. విదేశాలకు కేటీఆర్ షికారు కోసం వెళ్లారని విమర్శించారు. కేసీఆర్ ఇతర రాష్ట్రాల రైతులకు పరిహారం ఇవ్వడాన్ని చూస్తే అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఉందని విమర్శించారు. ఆనాడు ఆంధ్ర సంస్థలను మూసివేస్తామని కేసీఆర్ అనడంతో వైఎస్సార్ వీసా అనే పదాన్ని వాడారని అన్నారు. ఆమె పాదయాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నడిచింది నేనే అయినా… నడిపించింది మాత్రం ప్రజలే అని అన్నారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని ఆమె అన్నారు. వైఎస్సాఆర్ ను తెలంగాణ ప్రజల మరిచిపోలేదని… షర్మిళను ఆదరిస్తున్నారంటే దానికి వైెఎస్సాఆరే కారణం అని ఆమె అన్నారు. ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version