సజ్జల వ్యాఖ్యలకు వైయస్ షర్మిల కౌంటర్.. మళ్లీ ఎలా కలుపుతారు !

-

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం మళ్లీ కలవాలన్న సజ్జల రామకృష్ణ వ్యాఖ్యలపై వైయస్ షర్మిల స్పందించారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు షర్మిల. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. నేడు తెలంగాణ ఒక వాస్తవమన్నారు.

ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు? అని అగ్రహించారు.

మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి; మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news