డీజే టిల్లు 2 హీరోయిన్లు దొరకడం కష్టమేనా.. ఆఖరికి ఆమె కూడా..!!

-

ప్రముఖ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి కాంబో లో తెరకెక్కించిన చిత్రం డీజే టిల్లు . చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా 2022 సంవత్సరానికి గాను బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా జాబితాలోకి చేరిపోయింది. గతంలో చిన్న సినిమాలతో.. సక్సెస్ లేక కొట్టుమిట్టాడిన సిద్దు జొన్నలగడ్డ ఈసారి డీజే టిల్లు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన తెలంగాణ యాస ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ క్రమంలోని డీజే టిల్లు సినిమా కూడా చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది . అయితే అంత అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయి ఉండేది.. కానీ ఇప్పటివరకు మొదటి షెడ్యూల్ కూడా ప్రారంభం కాలేదు కారణం ఈ సినిమాకు హీరోయిన్ కొరత ఏర్పడడమే.

మొదటి భాగంలో నేహా శెట్టి పార్ట్ ముగిసినట్టు చూపించారు. అందుకే రెండవ భాగంలో ఆమెను కాకుండా యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ను తీసుకున్నారు. అయితే ఈమెకు పెద్ద సినిమాలలో ఆఫర్ వచ్చేసరికి ఈ సినిమాకు నో చెప్పింది. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల సిద్దు తో ఏర్పడిన మనస్పర్ధలు వల్ల ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ ను తీసుకున్నారు. అంతా సిద్ధమైంది ఇక షెడ్యూల్ మొదలు పెడతారు అని అనుకునే లోపే ఆమె కూడా సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళ్తే.. స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు మొదటి లుక్ లోనే మడోన్నా సెబాస్టియన్ ఈ పాత్రకు సెట్ కాలేదు. దీంతో ఈమెను కూడా చిత్ర బృందం తొలగించినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా ఈ సినిమాకు హీరోయిన్లు దొరుకుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news