కేసీఆర్..నీ పాపం పండింది..నువ్వు, నీ కుటుంబం ఇక జైలుకే – షర్మిల

-

కేసీఆర్..నీ పాపం పండింది.. నీ పాపానికి పరిహారం చెల్లించుకొనుడే అంటూ వైఎస్‌ షర్మిల నిప్పులు చెరిగారు. ఎవడు చస్తే నాకేంటని.. వెంట నడిచినోళ్ళను .. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్ .. సకల జనులను మోసం చేసావ్ .. కానీ ఇప్పుడు నీ పీఠం కదులుతుందని .. లిక్కర్ మరకల్లో బిడ్డ జైలుకు పోతుందని.. పేపర్ లీకేజి వ్యవహారం అధికార శాపం అయ్యేసరికి.. ఎన్నికలు వస్తున్నాయని.. ఎత్తులు వేస్తున్నావా? అని చురకలు అంటించారు.

అయ్యా కెసిఆర్ గారు.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడు.. ఉద్యమకారులకు అన్యాయం జరిగినపుడు..మీ పార్టీ సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకొంటున్నప్పుడు..ఒక్క నాడైనా ఆత్మహత్యలు చేసుకోకండి అని ఒక్కరికైనా లెటర్ రాసావా? బిడ్డజైలు కు పోయే సమయం వచ్చే సరికి కేసీఆర్ కు .. కార్యకర్తలు గుర్తుకు వచ్చారు.. కార్యకర్తల బలం గుర్తుకు వచ్చింది .. తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చింది .. ఆత్మీయ సందేశం అని .. మొసలి కన్నీరు కారుస్తూ .. ఓపెన్ లెటర్లు రాస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు. నువ్వు ఎన్ని లెటర్లు రాసిన.. ఎన్ని కుప్పిగంతులు వేసినా .. నీ పాపం పండింది ..రేపు ఎన్నికల్లో నీ పాపానికి పరిహారం చెల్లించుకొనుడే .. నువ్వు నీ ఫ్యామిలీ జైలుకు పోవుడే అంటూ ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news