మార్చ్ 5న పాలేరులో వైయస్ షర్మిల “ప్రజాప్రస్థానం” పాదయాత్ర ముగింపు

-

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. మార్చ్ 5వ తేదీన పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో పాదయాత్ర ని ముగించనున్నారు షర్మిల. ఈ సందర్భంగా మార్చి 5వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. 4111KM మైలురాయి వద్ద పాదయాత్రని ముగించనున్నారు వైఎస్ షర్మిల.

ఈ నెల 20న పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకొని పాలేరుకు చేరుకోనున్నారు షర్మిల. తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తాండా వద్ద పాలేరు నియోజక వర్గంలో అడుగు పెట్టనున్నారు షర్మిల. 14 రోజుల పాటు నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. 2021 అక్టోబర్ 20న వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. ఏడాదిన్నర పాటు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తెలంగాణ అంతటా సాగింది ప్రజా ప్రస్థానం పాదయాత్ర.

Read more RELATED
Recommended to you

Latest news