కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకున్న‌ విజయసాయిరెడ్డి.. ఏం జ‌రిగిందంటే..?

-

హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స‌త్తం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. సరిగ్గా ఇద్దరు సీఎంలు భోజన సమయంలో కలిశారు. దీంతో కేసీఆర్‌తో కలిసి జగన్ భోజనం చేశారు. అయితే ప్రగతిభవన్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. జగన్‌తో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రగతిభవన్‌కు వచ్చారు. జగన్‌తో మాట్లాడుతున్న సమయంలో విజయసాయిని గమనించిన కేసీఆర్, ఆయన్ను పలకరించేందుకు ఆగారు.

ఇది గమనించిన విజయసాయి మర్యాదపూర్వకంగా కేసీఆర్‌కు పాదాభివందనం చేసేందుకు ముందుకు వంగారు. వెంటనే విజయసాయిని ఆపేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. ఈ లోపే సగం నడుమువంచిన విజయసాయి, కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, కేసీఆర్, జగన్ భేటీలో విభజన అంశాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌ఆర్సీతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news