యూపీని భయపెడుతున్న జికా వైరస్..

-

కరోనా వ్యాప్తి నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ కరోనా కట్టడిలో సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇటీవలే దేశంలో ఎక్కువ వ్యాక్సిన్ల వేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కరోనా కట్టడిలో విజయవంతం అయిందో.. లేదో .. మరో వైరస్ యూపీని కలవరపెడుతోంది. తాాజాగా జికా వైరస్ యూపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఇటీవల జికా వైరస్ కేసులు అధికమవుతున్నాయి. తాజాగా ఆరాష్ట్రంలోని కాన్పూర్ లో ఆదివారం రోజున కొత్తగా మరో 6 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఉత్తర్ ప్రదేశ్ లో జికా వైరస్ కేసులు 10కి చేరాయి.

ఈ అంశంపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జికా వ్యాధి వచ్చిన వారికి క్లోజ్ గా ఉన్నవారి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. ఇప్పటి వరకు ఇలా 654 నమూనాలను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకీ తరలించారు. ఇప్పటి వరకు 507 నమూనాలను పరీక్షిస్తే 9 మందికి పాజిటివ్ గా తేలింది. అక్టోబర్ 22న యూపీలో మొదటి జికా కేసు నమోదైంది. ముఖ్యంగా దోమల వల్ల జికా వైరస్ వ్యాపిస్తుంది. దీంతో కాన్పూర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. దోమల ఆవాసాలుగా ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తున్నారు. మరోవైపు జికా వ్యాధిగ్రస్తుల కోసం కాశీరామ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news