రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. దీపావళికి రానున్న Redmi A1.. 

-

రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌ రాబోతుంది. అదే రెడ్‌మీ ఏ1. దీపావళికి ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి రాబోతుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను మనదేశంలో టీజ్‌ చేసింది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్ సైట్లో కూడా ఇటీవలే కనిపించింది. ఏ1 ఆల్ రౌండర్స్ అని కంపెనీ తన ట్వీట్‌లో టీజ్ చేసింది. కాబట్టి ఏ1 అనేది సరికొత్త మొబైల్ సిరీస్ అని సమాచారం.. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రాసెసర్‌ను బట్టి చూస్తే రెడ్‌మీ ఏ1 ధర రూ.10 వేలలోపు ఉండనుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. రెడ్‌మీ ఏ1కు ఐస్ అని కోడ్ నేమ్ పెట్టారు.
రెడ్‌మీ నుంచి రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను షావోమీ సెప్టెంబర్ 6న లాంచ్ చేయనుంది. రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. యూఎస్ ఎఫ్‌సీసీ డేటా బేస్‌లో కూడా ఈ ఫోన్ చూడవచ్చు. 220733SL మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించింది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. గతంలో ఎంఐలో ఏ-సిరీస్ ఫోన్లు వచ్చేవి. ఎంఐ ఏ1, ఎంఐ ఏ2, ఎంఐ ఏ3 స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యాయి. స్టాక్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఆ ప్రయోగం వికటించడంతో ఆ సిరీస్‌ను కంపెనీ నిలిపివేసింది.
రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.13,499గా నిర్ణయించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈలో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news