ఇండోనేషియాలో లాంచ్‌ అయిన Vivo Y22.. ధర చాలా తక్కువ..!!

-

వీవో నుంచి కొత్త బడ్జెట్‌ ఫోన్‌ ఇండోనేషియాలో లాంచ్‌ అయింది. వై సిరీస్‌లో భాగంగా వీవో వై 22 పేరుతో ఫోన్‌ విడుదల చేశారు. త్వరలోనే మన దేశంలో కూడా ఫోన్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
వివో వై22 ధర..
దీని ధరను 23,99,000 ఇండోనేషియా కరెన్సీ అంటే సుమారు రూ.12,900గా నిర్ణయించారు. ఇది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర.
వివో ఇండోనేషియా ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
మెటావర్స్ గ్రీన్, స్టార్‌లైట్ బ్లూ, సమ్మర్ సియాన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.
వివో వై22 స్పెసిఫికేషన్లు, ఫీచర్స్..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89.67 శాతంగా ఉంది.
మీడియాటెక్ హీలియో జీ85 గేమింగ్ ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది.
6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది.
ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ఫీచర్ ద్వారా దీన్ని 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.
128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ బొకే సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news