కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్‌ వీ టీకాలు ఎలా పనిచేస్తాయో తెలుసా?

-

సెకండ్‌ వేవ్‌ కరోనా వేవ్‌ విజృంభిస్తోంది. ఈ సందర్భంగా టీకాల ఉత్పత్తి పెంచింది. కోట్ల జనాభా ఉన్న భారత్‌లో వ్యాక్సిన్‌ త్వరగా అందరికీ చేరడం కష్టతరమే. కానీ, కరోనా ఉధృతి నేపథ్యంలో నీతి ఆయోగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ గురువారం కేంద్ర ప్రభుత్వం 8 టీకాలను మనకోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇది ఈ ఏడాది చివరి నాటికి విజయవంతంగా భారతీయులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని ఆయన తెలిపారు. అలాగే ప్రస్తుతం టీకాల ఉత్పత్తిని పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది కేంద్రం. బయోలాజికల్‌ ఈ, జైడస్‌ క్యాడిలా, సిరం, భారత్‌ బయోటెక్, జెన్నోవా, స్పుత్నిక్‌ వీ టీకాలను తయారు చేస్తున్నాయి. రానున్న  రోజుల్లో ఇవి అందుబాటులోకి రానుంది.


రష్యాకు చెందిన స్పుత్నిక్,, ఆ దేశంలో మాస్‌ వ్యాక్సినేషన్‌ కోసం తయారు చేసింది. దీన్ని కూడా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. సింగిల్‌ డోస్‌తో నయం అవుతే రెండో డోస్‌ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెనికా తయారు చేసింది. స్పుత్నిక్‌ వీ కూడా ఇప్పటి వరకు దాదాపు 59 దేశాల్లో ఈ టీకాను తీసుకున్నారు. దీనిలో Ad26, Ad5 రెండు రకాల అడేనోవైరస్‌స్‌ కాంబినేషన్‌తో తయారు చే శారు. దీనివల్ల శరీరంలో త్వరగా ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది. దీనిపేరును ప్రపంచ మొదటి ఆర్టిఫిషియల్‌ శాటిలైట్‌ పేరుతో నామకరణం చేసింది రష్యా. మరికొన్ని రోజుల్లో ఇది భారత్‌లో కూడా అందుబాటులోకి రానుంది.

ఆస్ట్రాజెనికా సాధరణ నామం కొవీషీల్డ్‌. బీబీసీ నివేదిక ప్రకారం ఈ టీకా వల్ల ఎటువంటి అనారోగ్యం రాదని తెలిపింది. నిస్సాందేహంగా టీకా తీసుకోవచ్చని తెలిపింది.

భార త్‌కు చెందిన కోవాగ్జిన్‌ను కొవిడ్‌ వైరస్‌ను చంపడానికి తయారు చేసింది. దీన్ని భారత బయోటెక్‌ కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి తయారు చేసింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ప్రకారం ఈ టీకాతో ఇమ్యూన్‌ సెల్స్‌ చనిపోయిన వైరస్‌ను కూడా గుర్తించగలదని తెలిపింది. వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ను ఈ టీకా ప్రోత్సాహిస్తుంది. అదేవిధంగా కోవాగ్జిన్, కోవిషిల్డ్‌ రెండింటి టీకా సమయాన్ని కూడా పెంచింది.

Read more RELATED
Recommended to you

Latest news