అక్టోబర్ 4 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం..

-

అక్టోబర్ 4 నుండి ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియాలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు , అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు , మంచి క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటాయి. షాపింగ్ చేసే వాళ్లకి ఈ సేల్ బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ సేల్ లో భాగంగా మీరు మీ డబ్బులుని ఆదా చెయ్యచ్చు. అయితే ఈ సేల్ ఎన్ని రోజులు అనేది చెప్పలేదు. వెబ్‌సైట్ ప్రకారం స్మార్ట్‌ ఫోన్‌లు, ఐఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు , ఎలక్ట్రానిక్స్ పరికరాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

అదే విధంగా HDFC బ్యాంక్ కార్డును ఉపయోగిస్తే, వినియోగదారులు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అలానే ఈ సేల్ సమయం లో ప్రైమ్ మెంబర్‌లు ఆఫర్‌లు , డిస్కౌంట్‌లను ముందుగా సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని పొందొచ్చు. సేల్ సమయంలో అమెజాన్ అలెక్స, ఫైర్ TV స్టిక్, కిండ్ల్, ఎకో షో వంటి అమెజాన్ ఉత్పత్తులు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

వీటిపై గరిష్టంగా 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. సేల్‌లో ఉత్పత్తుల కొనుగోలుపై మీరు నో కాస్ట్ EMI ప్రయోజనాన్ని పొందగలరు. దీనితో పాటు, ఉత్పత్తిపై మార్పిడి సహాయంతో పొదుపులను కూడా చేయవచ్చు. ఇలా ఈ సేల్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news