ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో డబ్బులు రాలేదా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎఫ్ అకౌంట్ వడ్డీ డబ్బులు మీ అకౌంట్ ‌లోకి రాలేదా? అయితే మీరు ఏ చింత పడొద్దు. కేంద్ర ప్రభత్వం మీకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. సులువుగా మీరు ఫిర్యాదు చెయ్యొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేస్తోంది. కోట్ల మంది పీఎఫ్ ఖాతాల్లోకి ఈ డబ్బులు వచ్చేశాయి. ఇది ఇలా ఉంటే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు 8.5 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

money
money

అలానే మీ పీఎఫ్ అకౌంట్‌ లోకి డబ్బులు పడ్డాయో లేదో కూడా మీకు సులువు గానే తెలిసిపోతుంది. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని కూడా లేదు. కేవలం ఇంట్లో నుంచి పీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. అదే మీ పీఎఫ్ అకౌంట్‌లోకి వడ్డీ డబ్బులు రానట్టయితే మీరు ఫిర్యాదు చేయొచ్చు. దీని కోసం మొదట మీరు https://epfigms.gov.in/ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి అక్కడే ఫిర్యాదు చేయొచ్చు.

దీని కోసం ఖచ్చితంగా యూఏఎన్ నెంబర్ ఉండాలి. వెబ్‌సైట్‌ లోకి వెళ్ళాక రిజిస్టర్ గ్రీవెన్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు పీఎఫ్ మెంబర్ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అప్పుడు మీరు యూఏఎన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే…. గెట్ డీటైల్స్‌ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. గెట్ ఓటీపీపై మీరు ఇప్పుడు క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసాక… తర్వాత మీ పీఎఫ్ అకౌంట్ ఎంచుకోవాలి. మీకు వచ్చిన సమస్య, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ సబ్‌మిట్ చేయాలి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news