అయోధ్య రాముడి గుడి భూమి పూజకు తేదీ ఖరారు..!

-

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజకు తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించాలని రామ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించడానికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాటయింది. ఇవాళ సమావేశమైన ట్రస్ట్ సభ్యులు పలు అంశాలపై చర్చించారు.

రామాలయం నిర్మాణపనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించాలని నిర్ణయించారు. కాగా ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న అయోధ్య రామమందిర భూ వివాదానికి గత ఏడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ముగింపు పలికిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రయత్నించినా.. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news