చీరాల మాస్క్ వివాదం: ఎస్.ఐ విజయ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు…!

-

ప్రజాస్వామ్య దేశంలో మనిషిని పోలీసులు కొట్టిచంపే హక్కు ఉందా… అని ప్రకాశం జిల్లా చీరాలలో అధికారులను ఎస్సీ యువకుని బంధువులు నిలదీశారు. మాస్కు పెట్టుకోలేదని పోలీసులు కొట్టిన దెబ్బలకు ఎరిజర్ల కిరణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని. జాయింట్ కలెక్టర్ వెంకట మురళీ, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు.

suspend
suspend

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 10 లక్షలరుపాయల చెక్కును కుటుంబ సభ్యలకు అందజేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎవరైనా తప్పుచేస్తే పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లి కేసు పెట్టాలి… అంతేకాని కొట్టిచంపే హక్కు ఎవరిచ్చారని అధికారులను నిలదీశారు. కిరణ్ మృతికి కారణమైన ఎస్.ఐ విజయ్ కుమార్, మిగిలిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. గుంటూరు అదనపు ఎస్పీ గంగాధర్‌ను దర్యాప్తు అధికారిగా నియమించగా, కేసు దర్యాప్తును దర్శి డిఎస్పీకి అప్పగించారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు పరిహారం అందించేందుకు సీఎం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. చీరాల ఎస్సై విజయ్ కుమార్‌ను వీఆర్‌కు పంపినట్టు వెల్లడించారు.ఎస్పీ గంగాధర్‌ విచారణ జరిపిన తరువాత ఎస్.ఐ విజయ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news