ఏపీలో కరోనా సునామీ.. ఒక్కరోజులో భారీగా పెరిగిన కేసులు, మరణాలు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో 10,376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్రథమం. మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి చేరింది.

అటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 68 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది చనిపోయారు. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,349కి పెరిగింది. కొత్తగా 3,822 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 75,720 మంది చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news