వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం

-

ఏపీ సిఎం జగన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. జగన్‌ పెద్దమామ, సీఎం సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి పెద్దనాన్న ఈసీ పెద్ద గంగి రెడ్డి నిన్న కన్నుమూశారు. ప్రస్తుతం అయన వయసు 78 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన పులివెందులలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే కాస్త నయం కావడంతో ఆయన ఇటీవలే స్వగ్రామం అయిన గొల్లల గూడూరులోని తన ఇంటికి వచ్చేశారు.

కానీ నిన్న ఉదయం 5 గంటల సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో ఆయనని పులివెందులకు తరలించడానికి సిద్దమయ్యారు. అయితే అలా తరలిస్తున్న క్రమంలో ఆయన మార్గంమధ్యలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన గోల్లలగూడూరుకు తరలించారు. జగన్ తల్లి విజయమ్మ, జగన్ సతీ మణి భారతిరెడ్డి గొల్లగూడూరుకు చేరుకుని గంగి రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఇక జగన్ తాడేపల్లిలో అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉండడంతో ఆయన హాజరు కాలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news