బ్రేకింగ్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సంచలనం.. వారందరికీ క్లీన్ చిట్

-

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సంచలన అంశం చోటు చేసుకుంది. నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. నయీంతో సంబంధం ఉండి సెటిల్మెంట్ ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్ అధికారులకి క్లీన్ చిట్ ఇచ్చింది. ల్యాండ్ సెటిల్మెంట్లు , బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది అధికారులకి ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

25 మంది పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నయీం కేసులో 175 కి పైగా చార్జిషీట్లని సిట్ దాఖలు చేసింది. 130కి పైగా కేసుల్లో ఎనిమిది మంది రాజకీయ నాయకుల పేర్లు, ఇద్దరూ అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సిఐలు, హెడ్ కానిస్టేబుల్ లతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. నయీం కేసులో 25 మంది పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు ఈమేరకు సిట్ చీఫ్ నాగిరెడ్డి రిప్లై ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news